BREAKING: చిన్నాన్నను చంపినోళ్లకు ఆశ్రయం ఇస్తున్న జగన్ : పులివెందులలో షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: చిన్నాన్నను చంపినోళ్లకు ఆశ్రయం ఇస్తున్న జగన్ : పులివెందులలో షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల సమరానికి వైఎస్ షర్మిల సై అంటోంది. ముఖ్యంగా అధికార వైసీపీఅపై నిత్యం విమనార్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల ప్రచారంలో వాయువేగంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పుట్టిన గడ్డ పులివెందులలో సీఎం జగన్‌, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీల మధ్య ధర్మ యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా.. లేక హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా అంటూ జనాన్ని ప్రశ్నించారు. చిన్నాన్నను గొడ్డలితో నరికిన వారిని సీఎం జగన్ రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. జగన్ చేసిన వైఎస్ఆర్, వైఎస్ వివేకా ఆత్మలు క్షోభిస్తున్నాయని ఆరోపించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story